365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,బెంగళూరు, ఏప్రిల్ 4 ,2025: దేశీయ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌కు చెందిన డిజిటల్ బీ2బీ మార్కెట్ ప్లేస్ ఫ్లిప్‌కార్ట్ హోల్సేల్ వార్షిక ‘వ్యాపారీ దివస్’ సెల్‌ను ప్రారంభించింది. కిరాణా వ్యాపారుల లాభాలను పెంచడం, వారికి అధిక విలువను అందించడమే ఈ flagship సేల్ లక్ష్యం. ఈ సేల్ ఏప్రిల్ 5 నుంచి 13వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని ఫ్లిప్‌కార్ట్ హోల్సేల్ స్టోర్స్, మొబైల్ యాప్, వెబ్‌పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది.

‘వహీ వాదా, ఫాయిదా సబ్సే జ్యాదా’ అనే నినాదంతో చేపట్టిన ఈ సేల్‌లో సభ్యులకు 80% వరకు రాయితీలు, ప్రత్యేకమైన డీల్స్, Buy One Get One, Flat Price Stores లాంటి అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు లభించనున్నాయి.

Read this also…Flipkart Wholesale Launches ‘Vyapari Diwas’ 2025 to Empower Kirana Partners with Unmatched Offers

Read this also…Meta Unveils New AI-Powered Advertising Tools to Supercharge E-commerce and Retail Growth in India

Read this also…Startoon Labs Signs MOU with Medplus to Launch Pheezee Joint & Muscle Health Assessment

ఈ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ హోల్సేల్ వైస్ ప్రెసిడెంట్ దినకర్ అయిలవరపు మాట్లాడుతూ, “కిరాణాలు, ఎంఎస్ఎంఈల అభివృద్ధే మా లక్ష్యం. వారి విజయాలకు తోడుగా నిలవాలన్నదే మా ప్రయత్నం. ‘వ్యాపారీ దివస్’ ద్వారా భిన్న డీల్స్, ప్రత్యేక ఆఫర్లు, అత్యుత్తమ విలువలు అందించబోతున్నాం. మా సాంకేతిక పరిజ్ఞానాన్ని, సరఫరా శృంఖల సామర్థ్యాలను ఉపయోగించి, డిజిటలైజేషన్‌తో పాటు క్రెడిట్ సదుపాయాల ద్వారా చిన్న వ్యాపారాల బలోపేతానికి తోడ్పడతాం” అని తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్ హోల్సేల్ తన టెక్నాలజీ, మార్కెట్ లోతైన అవగాహనతో కిరాణా వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకు సమగ్ర వృద్ధి వాతావరణాన్ని కల్పిస్తోంది. డిజిటల్ ఫస్ట్ దృక్పథంతో అనేక విలువ ఆధారిత సేవలు అందిస్తోంది. ఫలితంగా చిన్న బ్రాండ్లు తమ వ్యాపార నిర్ణయాలను మరింత తెలివిగా తీసుకునే శక్తిని పొందుతున్నాయి.