Tue. Apr 30th, 2024
HMRL

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,నవంబర్ 12, 2022: హైటెక్ సిటీ మెట్రో స్టేషన్‌లో గాయపడిన మహిళా ప్రయాణీకురాలికి సంబంధించిన దురదృష్టకర సంఘటనపై హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) స్పందించింది. దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది.

మెట్రో సిబ్బంది పదే పదే విన్నవించినప్పటికీ ప్రథమ చికిత్స చేయలేదని ఆరోపిస్తూ ఓ ఆంగ్ల దినపత్రిక రాసినవి వాస్తవాలు కావని, విషయం ధృవీకరించకుండా వార్తరాయడం సరికాదని, సిసిటివి లో రికార్డయిన ఫుటేజీ ద్వారా అసలు వాస్తవాలు తెల్సుకోవాలని హెచ్ఎంఆర్ఎల్ ప్రతినిధి తెలిపారు.

HMRL

“ప్రయాణికురాలు కదులుతున్న ఎస్కలేటర్‌పై హడావిడిగా పరిగెత్తుతూ కనిపించింది. అందువల్లే ఆమె ఎస్కలేటర్ గాయపడింది, కానీ ఆమె గాయాన్ని గుర్తించలేదు, ప్లాట్‌ఫారమ్ వైపు సరిగ్గా టిక్కెట్‌ను కొనుగోలు చేసి, భద్రతా తనిఖీలను దాటింది. కొంతమంది తోటి ప్రయాణికులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. కాలి బొటనవేలుపై రక్తపు గుర్తులు ఉండడంతో వారు కాంటినెంటల్ కాఫీ షాప్‌ను, ఆ తర్వాత స్టేషన్ కంట్రోలర్ కార్యాలయాన్ని కూడా సంప్రదించారు” అని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది.

నివేదికలో పేర్కొన్నరక్తపు మడుగు, తోటి ప్రయాణికులు గాయంపై పోసిన నీరు తప్ప మరొకటి కాదని స్పష్టం చేసింది. మహిళా ప్రయాణీకురాలోకి కూడా వీల్ చైర్ సపోర్ట్ అందించినట్లు తెలిసింది హెచ్ఎంఆర్ఎల్.అన్ని మెట్రో స్టేషన్లు ప్రథమ చికిత్స వస్తు సామగ్రి అందుబాటు లో ఉంటాయని పేర్కొంది, ఆపదలో ఉన్న వారందరికీ సహాయం చేయడానికి తామసిబ్బందికి క్రమ శిక్షణ ఇస్తున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ తెలిపింది.