Mon. Jul 8th, 2024

ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 6,2024:బాడీ షేమింగ్‌ను అంతం చేయడానికే అంతర్జాతీయ నో డైట్ డేని జరుపుకుంటారని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నో డైట్ డే మే 6న జరుపుకుంటారు న్నారు.

ఈ సందర్భంగా డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నీవు ఎవరో తెలుసుకుంటే ఎదైనా మితంగా తీసుకోగలరన్నారు.

రుచులను రుచి చూడటం నుండి ఆహారం పట్ల ఆరోగ్యకరమైన దృక్పథాన్ని పెంపొందించుకోవడం వరకు, సంతోషకరమైన భోజనాన్ని ఆస్వాదించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

ప్రతి సంవత్సరం, అంతర్జాతీయ నో డైట్ డేని ఆదర్శ శరీర ప్రమాణాలను విచ్ఛిన్నం చేయడం శరీర వైవిధ్యాన్ని స్వీకరించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి జరుపుకుంటారన్నారు.

ఒక రకమైన శరీరాన్ని మాత్రమే అంగీకరించే , ఇతర రకాన్ని తిరస్కరించే ప్రపంచంలో మనం పెరిగామన్నారు. దానితో మనం మన స్వంత శరీర రకాలను అంగీకరించకపోవడం వల్ల మానసిక సమస్యలకి లోనవుతున్నారన్నారు.

మనం ఎలా ఉన్నామో మనల్ని మనం ఆలింగనం చేసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం, శరీర సానుకూలత , శరీర వైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి బరువు వివక్ష అంతం చేయడంలో సహాయపడటానికి నో డైట్ డేని జరుపుకోవాలని చెప్పారు .

బరువు,కొవ్వును తగ్గించుకోవడానికి మనకు నచ్చని ఆహార పదార్థాలను తింటామన్నారు. అందువల్ల భోజనాన్ని ఆస్వాదించలేక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు.

ఎలాంటి ఆంక్షలు లేని సంతోషకరమైన భోజనం రుచులను రుచి చూడడం దానిని ఆస్వాదించడం వల్ల ఒత్తిడి తగ్గుతుందన్నారు. కొత్త వంటకాలు, ఆహార పదార్థాలు ప్రయత్నించడం వల్ల మరింత చురుకుగా పని చేయగలరు న్నారు.

ఆరోగ్యకరమైన వైఖరి , ఆలోచనలు, సంతోషకరమైన దృక్పథాన్ని పెంపొందిస్తుంది న్నారు. ఇది తినే రుగ్మతలను పరిష్కరిస్తుందని తెలిపారు. ఎక్కువ ఆహారం తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది న్నారు. సంతోషంగా భోజనం చేయడం వల్ల మనం సంతృప్తి చెందుతామన్నారు.

ఇది మానసిక స్థితిని పెంచి మంచి అనుభూతి చెందడానికి సహాయపడుతుందని తెలిపారు. బరువు పెరుగుతున్నామనుకుని తిండిమానేయడం, అసలు ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కనిపించిందల్లా తినడం రెండూ పొరపాటేనన్నారు. నీరు త్రాగడం ఆకుకూరలు, కాయగూరలను ప్రతి భోజనంలో భాగం చేసుకోవాలన్నారు.

కాయగూరల్లో ఉండే విటమిన్లు శరీరానికి మేలు చేయడమే కాక పీచునూ అందించి పొట్ట నిండేలా చేసి, ఆకలినీ తగ్గిస్తాయని చెప్పారు. మెడిటేషన్ , యోగా, నడవడం రోజూ 30 నిమిషాలు చేయాలని తెలిపారు.

చిన్న చిన్న వ్యాయామాలను ప్రాక్టీస్ చేయించారు. ఈ కార్యక్రమంలో షేక్ హాలిమా రూహి, జి.హిమకర్, ఉషా , సాహితీ, లలిత, రాణి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ‌‌.

ఇది కూడా చదవండి: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ యూటర్న్.

ఇది కూడా చదవండి: స్విఫ్ట్ 2024ని మే 9న విడుదల చేస్తున్న మారుతి సుజుకి.

ఇది కూడా చదవండి: ఈ ఫోటో బ్యాగ్రౌండ్ తెలుసా..?

ఇది కూడా చదవండి: ప్రతి డ్యాన్స్‌లో ఆరోగ్య రహస్యాలున్నాయి..