365తెలుగు డాట్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, 28 ఏప్రిల్ 2025: తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్‌లో జియో ఎయిర్ ఫైబర్ సేవల ద్వారా 5G ఫిక్స్ డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) విభాగంలో జియో తన ఆధిపత్యాన్ని మరింత బల పరుచుకుంది. భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఫిబ్రవరి 2025కి విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, Jio తెలుగు రాష్ట్రాల్లో 5G FWA విభాగంలో అత్యధిక మార్కెట్ షేర్‌ను సంపాదించింది.

ఈ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)లో Jio AirFiber యాక్టివ్ సబ్‌స్క్రైబర్‌లు 2025 జనవరిలో 4,27,439 ఉండగా ఫిబ్రవరిలో 4,58,372 మందికి పెరిగారు.

ఇది కూడా చదవండి…“సినీ ఇండస్ట్రీలో తెలియ‌ని టీమ్‌ రూపొందించిన టాలీవుడ్ అతి పెద్ద మ్యూజికల్ డ్రామా ‘నిల‌వే’ టీజ‌ర్ విడుద‌ల”

Also read this…“Nilave: A Groundbreaking Telugu Musical Drama Unveils Soul-Stirring Teaser”

భారతీ ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్‌లు ఫిబ్రవరిలో 95,164 మంది మాత్రమే ఉన్నారు. అంటే.. 84% మార్కెట్ వాటా,అద్భుతమైన పనితీరుతో ఈ విభాగంలో జియో తన పోటీదారుల కంటే 5 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబర్ బేస్‌ను సంపాదించుకుంది.

తన 5G మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేయడం, అందుబాటులో ఉన్న ప్లాన్లను అందించడం,సులభమైన కస్టమర్ అనుభవాన్ని కల్పించడం ద్వారా జియో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రత్యేకంగా గ్రామీణ,నగర ప్రాంతాలలో ఎన్నో సవాళ్లను అధిగమించి మారు మూల ప్రాంతాలకు సైతం హై స్పీడ్ కనెక్టివిటీని జియో అందిస్తోంది. ఆప్టికల్ ఫైబర్ (జియో ఫైబర్) విస్తరించలేని చోట్ల ప్రతి ఇల్లు,చిన్న వ్యాపారానికి… గృహ వినోదం,బ్రాడ్‌బ్యాండ్ సేవలను జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి తెచ్చింది.

జియో ఎయిర్ ఫైబర్… 800కి పైగా డిజిటల్ టీవీ ఛానళ్ళు, 11కి పైగా OTT యాప్‌లు, నిరంతరాయంగా వైఫై, స్మార్ట్ హోమ్ సేవలు,హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌తో ప్రపంచ స్థాయి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది.

ఇది కూడా చదవండి…TFJA ఆధ్వర్యంలో ఫీనిక్స్ ఫౌండేషన్ & శంకర్ ఐ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత ‘ఐ స్క్రీనింగ్’ క్యాంప్‌కు విశేష స్పందన

Also read this…TFJA, Phoenix Foundation & Shankar Eye Hospital’s “Free Eye Screening Camp” Receives A Great Response

వివిధ వయస్సుల,నేపథ్యాల నుండి వినియోగదారులు ఇప్పుడు నిరవధిక హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్,ప్రపంచ స్థాయి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను పొందుతూ డిజిటల్ ఇండియా ప్రయోజనాలను నిజంగా అనుభవిస్తున్నారు.

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లలో వందలాది చిన్న, పెద్ద పట్టణాలు, వేలాది గ్రామాల్లో జియో ఎయిర్ ఫైబర్ డిజిటల్ ప్రాణశక్తిగా మారింది.