Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఏప్రిల్ 23,2024:రిలయన్స్ ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాలలో జియో తన జోరును కొనసాగించింది. తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం జియో నెట్‌వర్క్‌లో మొత్తం డేటా ట్రాఫిక్ 40.9 ఎక్సాబైట్‌లకు చేరుకుంది.

గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే డాటా ట్రాఫిక్ దాదాపు 35.2 శాతం పెరిగింది. 5G,హోమ్‌ లపై పెరిగిన ట్రాక్షన్ ద్వారా ఇది సాధ్యపడింది. మొబిలిటీ డేటా ట్రాఫిక్‌లో 5G సేవలు దాదాపు 28% వాటాను కలిగి ఉంటాయి. జియో నెట్‌వర్క్‌లో నెలవారీ డేటా ట్రాఫిక్ 14 ఎక్సాబైట్‌లను దాటింది.

2018లో భారతదేశం నెలవారీ మొబైల్ డేటా ట్రాఫిక్ 4.5 ఎక్సాబైట్లు మాత్రమే. కోవిడ్ నుంచి వార్షిక డేటా ట్రాఫిక్ 2.4 రేట్లు పెరిగింది. తలసరి నెలవారీ డేటా వినియోగం మూడేళ్ల క్రితం కేవలం 13.3 GB ఉండగా ఇప్పుడు అది 28.7 GB కి పెరిగింది.

మార్చి 2024 నాటికి జియో సబ్‌స్క్రైబర్ బేస్ 48.18 కోట్లకు చేరుకుంది. అందులో 10.8 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు జియో ట్రూ5G స్టాండలోన్ నెట్‌వర్క్‌లో ఉన్నారు.

ఇది కూడా చదవండి: తగ్గిన OnePlus 5G స్మార్ట్‌ఫోన్ ధర..