365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 13,2025: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన ప్రస్థానంలో మరో మైలురాయిని చేరుకుంది. సంస్థ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మేనేజింగ్ డైరెక్టర్ వి. శ్రీనివాస్ రావు సారథ్యంలో ఆదివారం నగరంలోని నోవోటెల్ హోటల్లో అట్టహాసంగా వేడుకలు నిర్వహించారు.
మాతృమూర్తుల ప్రాముఖ్యతను చాటే మదర్స్ డే సందర్భంగా జరిగిన ఈ వేడుకకు ఆధ్యాత్మిక వేత్త జ్యోతిర్మయి ప్రత్యేక అతిథిగా విచ్చేసి ఆశీర్వచ నాలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ వి. శ్రీనివాస్ చేపట్టిన పలు సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సైకాలజిస్ట్ డా. హిప్నో పద్మా కమలాకర్ను ఘనంగా సత్కరించారు. ఆమెకు జ్ఞాపికను అందజేశారు.
ఇది కూడా చదవండి…యూటీఐ లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్ – తక్కువ ధరలో నాణ్యమైన పెట్టుబడులు..
Read this also..Vespa Launches 2025 Luxury Scooter Line-Up, Elevates Brand to Lifestyle Icon..
ఈ వేడుకకు నగరంలోని పలువురు ప్రముఖులు, నిఖిల కన్స్ట్రక్షన్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు.

సాంస్కృతిక కార్యక్రమాలు అలరించగా, సంస్థలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేయడంతో వేడుక మరింత ఉత్సాహంగా సాగింది.
ఈ సందర్భంగా వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, సంస్థ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రతి ఉద్యోగి నిబద్ధతే కారణమని కొనియాడారు. వారి అవిరళ కృషి వల్లే 20 ఏళ్ల ప్రయాణం విజయవంతంగా సాగిందని ఆయన అన్నారు.
Read this also..JSW One Platforms Raises ₹340 Cr, Joins India’s Unicorn Club in B2B E-commerce..
Read this also..PNB Housing Launches Fixed Rate Non-Home Loan Product..
అంతేకాకుండా, ఈ వేడుక వేదికగా నిఖిల కన్స్ట్రక్షన్స్ భవిష్యత్ ప్రణాళికలను, సమాజానికి తమవంతుగా చేయబోయే కార్యక్రమాలను కూడా సంస్థ ప్రకటించింది.