Mon. Jul 8th, 2024
అధ్యయనంలోని కీలకాంశాలు:
రంగాలవారీ పరిశీలనలు: అత్యధికంగా డిజిటలీకరించిన మూడు రంగాల్లో ఐటీ-ఐటీఈఎస్ఆర్థిక సర్వీసులు మరియు రవాణా రంగాలు ఉన్నాయి. డిజిటల్ మెచ్యూరిటీలో ఈ మూడు అగ్రగాములుగా ఉండగారిటైల్ మరియు నిర్మాణం వంటి రంగాలు కూడా గణనీయంగా పురోగమిస్తున్నాయి. ·         బడ్జెట్ కేటాయింపు43% ఎంఎస్ఎంఈలు 2025 నాటికల్లా తమ మొత్తం డిజిటలీకరణ బడ్జెట్‌ను పెంచుకునే ప్రణాళికల్లో ఉన్నాయి. డిజిటల్ పరివర్తన వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోందనడాన్ని సూచిస్తూ డిజిటల్ మెచ్యూరిటీ ఇండెక్స్ (డీఎంఐ) తక్కువగా ఉన్న రంగాలు తమ పెట్టుబడులను పెంచుకునే యోచనలో ఉన్నాయి. ·         సీనియర్ లీడర్‌షిప్ లేదా సీఈవోలు కూడా పాలుపంచుకోవడం వల్ల మరింత సమగ్రమైన డిజిటల్ పరివర్తన ఫలితాల సాధన: సీనియర్ లీడర్‌షిప్ మరియు సీఈవోలు ముందుండి నడిపిస్తే డిజిటలీకరణ సక్సెస్ రేటు మరింత ఎక్కువగా ఉంటోంది. ·         నాలెడ్జ్ గ్యాప్‌, ఆర్థిక పరిమితులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, ఉత్పాదకతను పెంచుకునేందుకు, కలిసి పని చేసేందుకు, మార్కెట్ రీచ్ కోసం ఎంఎస్ఎంఈలు గణనీయంగా క్లౌడ్ కంప్యూటింగ్, ఐవోటీ మరియు అధునాతన వర్క్‌స్పేస్ టూల్స్‌ను ఉపయోగించుకోవడాన్ని పెంచుకుంటున్నాయి. అధ్యయనం ప్రకారం ఐటీ&ఐటీఈఎస్, రిటైల్ మరియు నిర్మాణ రంగాలకు చెందిన ఎంఎస్ఎంఈల్లో 40% సంస్థలు వ్యాపారంలో ఐవోటీ సొల్యూషన్స్‌ను వినియోగిస్తున్నాయి.·         మహమ్మారి సమయంలో, ఎంఎస్ఎంఈలు తమ వర్క్‌స్పేస్‌లను డిజిటలీకరించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వగా 2024లో తమ కస్టమర్లతో డిజిటల్‌గా ఎంగేజ్ కావడంపై దృష్టి పెడుతున్నాయి. ఎంఎస్ఎంఈలు డిజిటల్ సెక్యూరిటీపైఇటు కస్టమర్లతో (కస్టమర్ సర్వీస్) అటు భావి కస్టమర్లతో (కస్టమర్ ఎంగేజ్‌మెంట్) డిజిటల్‌గా ఎంగేజ్ చేయడంపై ఫోకస్ చేయాలని అధ్యయనం సూచిస్తోంది. తద్వారా మారుతున్న కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా డిజిటల్ వ్యూహాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. ·         డిజిటలీకరణతో టర్నోవరుపై ప్రత్యక్షంగా సానుకూల ప్రభావం ఉంటుంది. మధ్య స్థాయి నుంచి పెద్ద స్థాయి కంపెనీలు డిజిటలీకరణను అమలు చేస్తున్నాయనడానికి సంస్థ పరిమాణం పెరిగే కొద్దీ డిజిటల్ మెచ్యూరిటీ వ్యత్యాసాల స్థాయి తగ్గుతుండటం నిదర్శనం. లఘు, చిన్న సంస్థల్లో డిజిటల్ వినియోగం ఒక మోస్తరుగా ఉంది. ·         పెరుగుతున్న డేటా భద్రత మరియు డేటా గోప్యత సొల్యూషన్స్‌ అవసరాలు:  43 ఎంఎస్ఎంఈలు ప్రస్తుతం డివైజ్ సెక్యూరిటీ టెక్నాలజీలు, డేటా, డివైజ్ ప్రొటెక్షన్‌ను ఉపయోగిస్తున్నాయి.అంతేగాకుండా రూ. 10 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న ఎంఎస్ఎంఈలు పబ్లిక్ క్లౌడ్ ఉపయోగిస్తుండగా, రూ. 10 నుంచి రూ. 100 కోట్ల వరకు టర్నోవరు ఉన్నవి ప్రైవేట్ క్లౌడ్‌ను ఉపయోగిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల టర్నోవరు పెరిగే కొద్దీ డేటా భద్రత, గోప్యత అవసరాలు కూడా పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తుంది. అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి: https://www.myvi.in/content/dam/vodafoneideadigital/business/msme/ribbonBanner/MSME-Growth_Insight_Study_Vol_2024.pdf 

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 4,2024:భారత ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు వెన్నెముకలాంటివి. వీటికి దేశ జీడీపీలో సుమారు 30 శాతం వాటా ఉంటుంది. 2027 నాటికి జీడీపీలో వీటి వాటా 35-40 శాతానికి పెరగవచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి వృద్ధి సామర్థ్యాలతో పని చేసేందుకు, 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్ (అభివృద్ధి చెందిన ఎకానమీ)గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించేందుకు ఎంఎస్ఎంఈలు డిజిటలీకరణ బాట పట్టడం చాలా ముఖ్యం.

డిజిటల్ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఉద్యమ్ పోర్టల్, ఉద్యమ్ మిత్రా మరియు ఇతరత్రా చర్యలు, విధానాలను ప్రవేశపెట్టింది.

ఉత్పాదకతను పెంచుకునేందుకు, కార్యకలాపాలను క్రమబద్ధీకరించుకునేందుకు,  పోటీతత్వాన్ని మెరుగుపర్చుకునేందుకు ఎంఎస్ఎంఈ పరిశ్రమకు ఇవన్నీ తోడ్పడగలవు.

భారత ప్రభుత్వ వృద్ధి అజెండాలో భాగస్వామిగా దిగ్గజ టెలికం ఆపరేటర్ వీ (Vi)లో ఎంటర్‌ప్రైజ్ విభాగమైన వీ బిజినెస్, ప్రపంచ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్త అధ్యయనం ‘వి బిజినెస్రెడీ ఫర్ నెక్ట్స్ ఎంఎస్ఎంఈ గ్రోత్ ఇన్‌సైట్స్ స్టడీ (వాల్యూమ్ 2.0 2024)’ను విడుదల చేసింది.

ఐటీ & ఐటీఈఎస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రవాణా, నిర్మాణ, రిటైల్, వ్యవసాయం,  మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్, తయారీ తదితర 16 రంగాలవ్యాప్తంగా ఎంఎస్ఎంఈల డిజిటల్ మెచ్యూరిటీపైనా అలాగే అవి డిజిటైజేషన్ మరియు టెక్నాలజీని అవి ఏ విధంగా ఉపయోగిస్తున్నాయనే దానిపై ఈ సమగ్ర అధ్యయనం దృష్టి పెట్టింది.

దీనితో పాటు తమ ఎంఎస్ఎంఈ ప్రోగ్రాం #ReadyForNextకి కొనసాగింపుగా ఇంగ్లీష్, హిందీలో మెరుగుపర్చిన డిజిటల్ అసెస్‌మెంట్ టూల్‌ను కూడా వీ బిజినెస్ ఆవిష్కరించింది. ఈ అసెస్‌మెంట్‌కి ప్రధానంగా మూడు మూలస్తంభాలు ఉన్నాయి. అవేంటంటే: డిజిటల్ కస్టమర్, డిజిటల్ వర్క్‌స్పేస్ మరియు డిజిటల్ బిజినెస్.

సమాధానాల ఆధారంగా ఈ సాధనం, పరిశ్రమ ప్రమాణాలతో పోలిస్తే సదరు వ్యాపారం యొక్క డిజిటల్ మెచ్యూరిటీపై నిర్దిష్ట యూజర్‌ సంబంధిత నివేదికను అందించడంతో పాటు సంబంధిత డిజిటల్ ఉత్పత్తులను కూడా సిఫార్సు చేస్తుంది. ఈ టూల్‌ను ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి: https://www.myvi.in/business/enterprise-segments/smb/msme-readyfornext

“భారత వృద్ధి అజెండాలోను, ఎకానమీకి తోడ్పాటు అందించడంలోను ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వీ బిజినెస్ విశ్వసిస్తోంది. ఎంఎస్ఎంఈలపై మేము విస్తృతంగా నిర్వహించిన సర్వే, భారత్‌లో చిన్న వ్యాపారాలు ప్రోత్సాహకర పురోగతిని సాధించిన విషయంతో పాటు వాటి డిజిటల్ పరివర్తనలో ఎదురవుతున్న సవాళ్లను కూడా ప్రస్తావించింది.

ఇది ఎంఎస్ఎంఈల ఆధారిత డిజిటల్ అసెస్‌మెంట్‌కి సంబంధించి భారత్‌లోనే అతి పెద్ద అధ్యయనం, అటువంటి సంస్థలు ముందుకు పురోగమించేందుకు తోడ్పడే ఉపయోగకరమైన అంశాలను కూడా ఇది అందిస్తుంది. భారత డిజిటల్ ఎకానమీ పురోగతికి, ఎంఎస్ఎంఈలు పూర్తి సామర్థ్యాలతో పని చేయడంలో తోడ్పాటు అందించే భాగస్వామిగా వీ బిజినెస్ ఉంటుంది” అని వొడాఫోన్ ఐడియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అరవింద్ నెవాతియా తెలిపారు.

నివేదిక ప్రక్రియ

‘వీ బిజినెస్ రెడీఫర్‌నెక్ట్స్‌ఎంఎస్ఎంఈ గ్రోత్ ఇన్‌సైట్స్ స్టడీ వాల్యూమ్ 2.0’ భారత్‌లో ఐటీ & ఐటీఈఎస్, నిర్మాణ, రవాణా, మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్,  మైనింగ్, రిటైల్, ఆర్థిక రంగం, వ్యవసాయం, ప్రొఫెషనల్ సర్వీసులు, విద్య, టూరిజం & హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్ మొదలైన 16 పరిశ్రమలవ్యాప్తంగా 1.6 లక్షల ఎంఎస్ఎంఈలపై సర్వే ఆధారంగా రూపొందించబడింది.

డిజిటల్ వినియోగంలో వ్యత్యాసాలను ప్రస్ఫుటంగా తెలిపేందుకు రంగాలు, కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతాలు, కంపెనీ పరిమాణంపరంగా ఎంఎస్ఎంఈలు వర్గీకరించబడ్డాయి. వివిధ పరిశ్రమలకు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ఐటీ మరియు టెలికం రంగాలు ప్రధానంగా టెక్నాలజీ ఆధారితమైనవి ఉంటాయి కాబట్టి వాటికి ఎక్కువగా టెక్నికల్ ప్రశ్నలు ఇవ్వబడ్డాయి.

ఇక తక్కువ వినియోగ రేటు, వనరులపరమైన పరిమితులు ఉండే వ్యవసాయం, తయారీ పరిశ్రమలకు వాటికి అనుగుణమైన ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. రూ. 10 కోట్ల కన్నా తక్కువ నుంచి రూ. 250 కోట్ల వరకు టర్నోవరు ప్రాతిపదికన ఎంఎస్ఎంఈలు వర్గీకరించబడ్డాయి.

Also read :“Almost 60% of MSMEs Plan to Digitize their Business Processes by 2025”, Reveals Vi Business Ready for Next  MSME Growth Insights Study Vol 2.0, 2024

Also read :Volkswagen India announces the start of Autofest,Mega Exchange Carnival 2024

Also read :Premier Energies Limited along with its subsidiaries secures a 350 MW solar  module supply order from Apraava Energy

Also read :NPCI International partners with Network International to enable UPI QR payment acceptance across its merchants in the UAE

ఇదికూడా చదవండి: గ్యాస్ సిలిండర్లకు గడువు ఉంటుందని మీకు తెలుసా..?

Also read :Gas cylinders have an expiration date, did you know that?..