365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,వారణాసి,మే15, 2025: పహల్గాం దాడిలో అమాయక పర్యాటకుల మృతి తర్వాత భారత సైన్యం ప్రతీకారంగా చేపట్టిన “ఒపరేషన్ సిందూర్” బహుళ అంశాల్లో చరిత్రగా నిలిచింది.
మే 7న తెల్లవారు ఝామున 2.30 గంటలకు మొదలైన ఈ రహస్య వైమానిక దాడి కేవలం 23 నిమిషాల్లోనే పూర్తయింది. అయితే ఈ తక్కువ సమయంలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) సహా పాకిస్తాన్లోని తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలను నశింపజేయడమే ఈ ఆపరేషన్ ఇన్స్పిరేషన్.
ఇది కూడా చదవండి…తుర్కియే, అజర్బైజాన్ దేశాల పట్ల భారతీయుల ఆగ్రహం..
ఇది కూడా చదవండి…ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయి విచారణ..
ఇది కూడా చదవండి…బహుళ బంగారు పతకాలతో ఆసియా పవర్లిఫ్టింగ్లో రాణించిన కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులు..
ఈ దాడుల్లో భారత్ ఐదు రకాల ఆధునిక ఆయుధాలను వినియోగించింది. వీటిలో SCALP క్రూయిజ్ మిస్సైళ్లు, HAMMER గైడెడ్ బాంబులు, స్వదేశీ ఆకాశ్ మిస్సైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లు (loitering munitions) హెవీ క్వాంటమ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నాయి. ISRO ఉపగ్రహాల ద్వారా సమయోచిత సమాచారాన్ని సేకరించి, లక్ష్యాలను ఖచ్చితంగా గమనించి దాడులు జరిగాయి.
చైనా తయారీ PL-15 మిస్సైళ్లు, టర్కీ తయారీ Bayraktar డ్రోన్లను పాక్ వాడినా అవి భారత్ వాడిన టెక్నాలజీ ముందు విఫలమయ్యాయి. అత్యాధునిక రేడార్ జామింగ్ టెక్నాలజీతో భారత డ్రోన్లు అవి గుర్తించకుండానే టార్గెట్లను ఛేదించాయి.

దాడిలో ముఖ్య ఉగ్రవాద సంస్ధలైన జైష్-ఎ-మహమ్మద్, లష్కరే తోయిబా శిబిరాలు నేలమట్టమయ్యాయి. మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 14 మంది హతమవడమొక ముఖ్య ఫలితం. పాక్ నుంచి నిరసనలు వ్యక్తమైనా, భారత ప్రభుత్వం ఈ దాడిని దేశ భద్రతకు ముఖ్యమని భావించింది.
ఈ ఆపరేషన్ భారత సైనిక సత్తా, స్వదేశీ టెక్నాలజీ సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఇది కేవలం ఓ దాడి మాత్రమే కాకుండా, దేశ భద్రత పట్ల ఉన్న నిబద్ధతకు చిహ్నంగా నిలిచింది.