365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి 4, 2025 : అందరికీ న్యాయం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు చంద్రబాబు నాయుడు.. ప్రజలకు మాత్రమే కాకుండా, పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేసే దిశగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ఒకవైపు రాష్ట్ర పాలనలో ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే, మరోవైపు పార్టీ బలోపేతానికి, నమ్మిన నేతలకు గౌరవం కల్పించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్సీ నియామకాల నుంచి ‘సూపర్ సిక్స్’ పథకాల అమలువరకు ఆయన రాజకీయ ప్రణాళికలు బలంగా అమలు చేస్తున్నారు.

టీడీపీపై విపక్షాలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తుండగా, యువనేత నారా లోకేష్ ‘యువగళం’ హామీలను గత ఎనిమిది నెలలుగా నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ కూటమిగా ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ పథకాలకు 2025-26 బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు పటిష్ట ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

ఇది కూడా చదవండి…హోర్డింగుల తొలగింపునకు గడువు – అనుమతి లేనివి తొలగింపు తప్పదు!

ఇది కూడా చదవండి…పాత లే ఔట్ల‌పై కబ్జాల జోరు – హైడ్రా ప్ర‌జావాణికి 49 ఫిర్యాదులు

చంద్రబాబు వ్యూహం..


మార్చిలో ఖాళీ కానున్న ఐదు శాసన మండలి స్థానాల కోసం చంద్రబాబు ఇప్పటికే తన వ్యూహాన్ని పూర్తిచేశారు. ఎన్నికల ప్రచారంలో 175 స్థానాల్లో ప్రచారం చేసినప్పటికీ, ఆయన బహిరంగంగా ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది కేవలం ఇద్దరికే.

-పదవి దక్కిన తొలి నేత – పల్నాడు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్
-రెండో అవకాశం – పిఠాపురం శాసనసభ స్థానాన్ని త్యాగం చేసిన ఎస్ వి ఎస్ వర్మ
– మిగిలిన మూడు స్థానాలు – దిగ్గజ నేత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రంగాకు ఒక అవకాశం, జనసేన కోటాలో నాగేంద్రబాబు, బీసీ సామాజికవర్గానికి మరో ఎమ్మెల్సీ స్థానం ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

బలమైన రాజకీయ వ్యూహం..


ఇటీవల జరిగిన పరిణామాలను చూస్తే, చంద్రబాబు మాట నిలబెట్టుకునే నేతగా మరోసారి నిరూపించుకున్నారు. నమ్మిన నేతలకు న్యాయం చేస్తూనే, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి పటిష్టమైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. కార్యకర్తల నిబద్ధతను పెంచేందుకు, కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ రాజకీయాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ టీడీపీ మెరుగైన రాజకీయ కార్యాచరణను అమలు చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.