365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుప‌తి,ఏప్రిల్ 20 ,2024: తిరుపతి శ్రీ కోదండరామాలయంలో కొలువైన శ్రీ సీతారాములు, లక్ష్మణస్వామి వారికి రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం ఘనంగా జరిగింది.

ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు శ్రీ కోదండరామాలయం నుంచి శ్రీ సీతారాముల సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను పాత ప్రసూతి ఆసుపత్రి రోడ్డులోని రేపాకుల సుబ్బమ్మ తోట(ఆర్‌ఎస్‌ గార్డెన్స్‌)కు ఊరేగింపుగా తీసుకొచ్చారు.

ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, ఆస్థానం, నివేదన నిర్వహించారు.

సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు రాత్రి 7 గంటలకు శ్రీ కోదండరామాలయానికి చేరుకుంది.

శ్రీకోదండరామస్వామికి రేపాకుల సుబ్బమ్మ అపర భక్తురాలు. ఈమె వందేళ్ల క్రితం స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించేవారు.1910వ సంవత్సరం నుంచి కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహన సేవలను సొంత ఖర్చులతో నిర్వహించేవారు.

తన తదనంతరం కూడా ఈ సేవలు కొనసాగాలనే తలంపుతో 1933వ సంవత్సరం లో కొంత స్థలాన్ని కోదండరామాలయానికి విరాళంగా అందించారు. ఈ భూమిలోనే ప్రస్తుతం ఎస్వీ బాలమందిరం, ఆర్‌ఎస్‌ గార్డెన్స్‌ ఉన్నాయి.

కోదండరాముని భక్తురాలైన రేపాకుల సుబ్బమ్మ కోరిక మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తోంది.

ఇది కూడా చదవండి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుగ్గోత్సవం ఘనంగా ప్రారంభం..

Also read :Embrace the New Season with Amazon Fashion’s Spring-Summer’24 Collection and stay ‘Har Pal Fashionable’

ఇది కూడా చదవండి: భారతదేశంలో సూపర్ గురు 4జీ కీప్యాడ్ ఫోన్‌ను విడుదల చేసిన ఐటల్..

ఇది కూడా చదవండి: ది బోరింగ్ ఫోన్‌ని పరిచయం చేసిన నోకియా..

ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు..

ఇది కూడా చదవండి: వియజయవాడలో ఆదివారం నాన్ వెజ్ షాపులు బంద్..

Also read : Spotify launches RADAR Punjabi and Fresh Finds Punjabi for emerging artists to showcase their music.. 

ఇది కూడా చదవండి: టాటా మహీంద్రా MGకి పోటీగా ఫోర్డ్ ఎండీవర్‌ SUV..

ఇది కూడా చదవండి: రోగనిరోధక శక్తిని పెంచే 4 సహజ ఆహారాలు పదార్దాలు..