Tue. May 21st, 2024
women-Self-employment

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,ఆగస్టు 19,2022: వంటలు ఆన్ లైన్ సేల్స్ పై ఈ నెల 27వ తేదీన లక్డీకాపూల్ వాసవి క్లబ్ లో అవగాహనా సదస్సు జరగనుంది. ఇంటివద్ద ఉంటూనే తమకు తెలిసిన బంట నైపుణ్యానికి కొన్ని మెళకువలు జోడించి ఆన్ లైన్ ద్వారా వాటిని అమ్మడం ద్వారా ప్రతి నెలా ఓ స్థిరమైన ఆదాయాన్ని పొంది స్వయం ఉపాధి పొందేలా తెలుగు, తమిళ,కేరళ, నార్త్ ఇండియా వంటకాలపై అవగాహన కల్పించనున్నట్లు షీరో ఫౌండేషన్ కన్వీనర్ సువర్ణా దేవి పాకలపాటి పేర్కొన్నారు.

ఈ నెల 27 వ తేదీన సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు హైదరాబాద్ లక్డీకాపూల్ వాసవి క్లబ్ లో జరిగే ఈ అవగాహనా సదస్సు లో మహిళలు ఎవరైనా పాల్గొనవొచ్చని .. ఇందుకు గాను ఎలాంటి ప్రవేశ రుసుము చెల్లించ అవసరం లేదని , ఆసక్తి కల వారు 6309527444 నెంబర్ లో సంప్రదించి తమ పేరుని నమోదు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.