Sat. Jul 27th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 30,2024:భారతీయ యోగా సంస్థాన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ లో “వసంతోత్సవం” వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమంలో 6 యోగా సెంటర్లు పాల్గొన్నారు.

5 గ్రూప్ లు డ్యాన్స్ పోటీలో పాల్గొనగా బి.సరోజని రామారావు టీం మొదటి బహుమతి గెలుచుకుంది.

భారతీయ యోగా సంస్థాన్ స్టేట్ ప్రెసిడెంట్ సుదీర్ కులకర్ణి, ఎ.ఎస్.చారి, సుధాకర్ యాదవ్,డా.రాధ రాణి బహుమతులు అందజేశారు.

ఈ గ్రూపులో భారత మాతగా బి.సరోజనీ రామారావు, డా.హిప్నో పద్మా కమలాకర్, పి.స్వరూపా రాణి, జ్యోతి రాజా, పూర్ణ కుమారి, వాణిశ్రీ, కృష్ణ వేణి,సుజాత,శ్రీలత, యశోద, గీత, అనిత,పాల్గొన్నారు.